సెలూన్ పేరుతో క్రాస్ మసాజ్: ఇద్దరు యువతుల అరెస్ట్, యజమాని కూడా..
ఎంత నిఘా ఉన్న.. డేగ కళ్లతో పర్యవేక్షిస్తోన్న స్పా ముసుగులో క్రాస్ మసాజ్ జరుగుతూనే ఉన్నాయి. విశ్వనగరి భాగ్యనగరంలో ఆడపా దడపా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం కూడా స్పా ముసుగులో జరుగుతోన్న క్రాస్ మసాజ్ వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేయడంతో.. గుట్టు రట్టయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ జరుగుతుందని పోలీసులు గుర్తించారు.
సెలూన్ పేరుతో..
ఎస్ఆర్ నగర్ స్టార్ ఫ్యామిలీ సెలూన్ ఉంది. అయితే ఇక్కడ మసాజ్, స్పా సెంటర్ కొనసాగుతోంది. అయితే మసాజ్ పేరుతో క్రాస్ మసాజ్ జరుగుతోంది. దీనికి సంబంధించి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు తన టీంతో కలిసి రైడ్ నిర్వహించారు. ఇద్దరు యవతులు అందులో కనిపించారు. స్పా సెంటర్ యాజమాని నాగేందర్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.
అనైతిక కార్యకలాపాలు..
జనం రద్దీగా ఉండే చోట స్పాలో అనైతిక కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. విషయం తెలిసి చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టారు. మసాజ్ పేరుతో ఇలాంటి పనులు ఏంటీ అని మండిపడుతున్నారు. ఇరువైపులా ఫ్యామిలీస్ ఉంటాయని.. ఇలా చేస్తే ఎలా ఉండాలని కోరుతున్నారు. మరొకరు ఇలా చేయడానికి వీలులేకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తనిఖీ చేస్తారనే భయంతో
స్పా, మసాజ్ సెంటర్ పేరుతో తెరిస్తే అప్పుడప్పుడు తనిఖీ చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వారు భయపడి అనైతిక కార్యకలాపాలకు దిగే అవకాశం ఉండదు. పర్మిషన్ ఇచ్చిన అన్నీ సెంటర్లపై కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. వాస్తవానికి ఈ డిమాండ్ కూడా న్యాయమైనది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.