శంషాబాద్లో గోల్డే...గోల్డు...!! క్వింటాలుకు పైగా పట్టివేత
ఎలాంటీ అనుమతులు లేకుండా విదేశాల నుండి తీసుకువస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాగా బంగారాన్ని మలేషియా నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా స్వాధినం చేసుకున్నట్టు తెలుస్తోంది.
గత కొద్ది కాలంగా మలేషీయా, సింగపూర్ దేశాల నుండి అనుమతులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో ఆయా దేశాల నుండి వస్తున్న పార్శీళ్లను అధికారులు తనిఖీలు చేశారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధినం చేసుకున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం ఆర్కే డిజిటల్ అనే ఓ సంస్థ తీసుకొచ్చినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది.. కాగా బంగారం రవాణ వెనక ఇతర పెద్దల హస్తం ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆర్కే డిజిటల్కు అనుమతులు లేకున్నా, బంగారాన్ని రవాణ చేస్తున్నాట్టు కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇలా ఎన్ని రోజుల నుండి వ్యవహారం కొనసాగుతుందనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.