Delhi-Hyderabad: కోడలిని లాడ్జీకి తీసుకొచ్చి అత్యాచారం చేసిన మామ
హైదరాబాద్: కొడుకు భార్యను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన మామ. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హబీబ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హబీబ్నగర్ సీఐ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చలాస్దామ్ ప్రాంతానికి చెందిన మామ(55), కోడలు(21) దుస్తుల వ్యాపారం కోసం బుధవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో నాంపల్లిలో ఓ హోటల్ రూం తీసుకుని ఉన్నారు.
అయితే, అర్ధరాత్రి తన మామ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కోడలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడైన మామను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించామని, రిపోర్టు రాగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మద్యం మత్తులో భార్య గొంతుకోశాడు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్య గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన తుకారం అనే వ్యక్తికి మండల కేంద్రానికి చెందిన రాధాబాయితో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరేళ్ల కిందట మండలంలోని ధనోరా(బీ) గ్రామానికి వలస వచ్చి ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
తుకారం మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. 2019లో రాధాబాయి పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కొంతకాలం వరకు బాగానే ఉన్నారు. కాగా, గురువారం సాయంత్రం మళ్లీ ఇద్దరు గొడవపడ్డారు. దీంతో పూటుగా మద్యం తాగి వచ్చిన తుకారం.. మధ్యాహ్నం మరోసారి గొడవకు దిగి బ్లేడుతో ఆమె గొంతుకోశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.