హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమపై ఎందుకంత ప్రేమ.. సీఎం కేసీఆర్‌పై జేజమ్మ గుస్సా ...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై జేజమ్మ అరుణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని శివాలెత్తారు. అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని చెప్పిన కేసీఆర్ .. చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని డీకే అరుణ విమర్శించారు. ఆయన చెప్పేదోకటి.. చేసిది మరోకటి అని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చాకే పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఉద్యోగం లేదు, సద్యోగం లేదని గుర్తుచేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని పక్కన కూర్చొబెట్టుకొని సుద్దులు చెప్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టులు సాధించింది ఉమ్మడి రాష్ట్రంలో తనేనని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు.

dk aruna fire on cm kcr

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీఎంకు హరతి పట్టావని తనను కేసీఆర్ ఆరోపణలు చేశాడని గుర్తుచేశారు. మరీ కొత్త గా కేసీఆర్‌కు రాయలసీమ ప్రేమ పుట్టుకొస్తుందని ప్రశ్నించారు. ఈ ప్రేమ, దయలో ఆంతర్యం ఏంటని అడిగారు. రాజకీయ స్వలాభమా కాదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌తో దోస్తి కోసమే కాదా అని కొశ్చన్ చేశారు. కేసీఆర్ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని .. ఆయనకు బుద్దిచెప్తారన్నారు జేజమ్మ.

English summary
dk Aruna fire on CM KCR. He was ignorant of the welfare of the people. It has been criticized for repeating lies. KCR is lying about the Palmuru Rangareddy project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X