కార్లకు ఉచిత చార్జీంగ్.. బేగంపేట్ మెట్రో స్టేషన్లో ఎలక్ట్ర్రికల్ చార్జింగ్ సెంటర్
కాలుష్యరహిత హాహానాలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ పట్టణాభివృద్ది సంస్థ చార్జీంగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.ఇందులోబాగంగానే బేగంపేట్ మెట్రో స్టేషన్ అవరణలో చార్జీంగ్ స్టేషన్ను పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ప్రారంభించారు. అయితే వాహానాలకు ముందుగా ఉచిత చార్జీంగ్ చేయనున్నారు. అనంతరం కిలోమీటరుకు రూ.2 చొప్పున వసూలు చేయనున్నారు.కాగా ఒక గంటలోపే కారును చార్జీంగ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు.కాగా ఇందుకోసం ముందుగా స్లాట్కూడ బుక్ చేసుకునేందుకు ఓ యాప్ను కూడ విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
ఇటివల కాలుష్యరహిత వాహానాలైన ఎలక్ట్ర్రిక్ వాహానాలను దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్ర్రిక్ వాహానా కొనుగోలుదారులకు సబ్సిడి ఇచ్చేందుకు 10వేల కోట్ల రుపాయలను సైతం బడ్జెట్లో కేటాయించింది. దీంతో చాల కంపనీలు ఎలక్ట్ర్రిక్ వాహానాల తయారికి మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేట్ క్యాబ్లతోపాటు బస్సులు, టూవీలర్ వాహానాల తయారీ పుంజుకుంది. తాజగా హైదరాబాద్కు ఎలక్ట్ర్రిక్ బస్సుల కోనుగోలు కూడ చేసింది.
అయితే ఎలక్ట్ర్రిక్ వాహానాల కోనుగోలు బాగానే ఉన్నా వాటి చార్జింగ్ కోసం ఇబ్బందికర పరిణామాలు ఉంటున్నాయి. సరైన చార్జీంగ్ సదుపాయాలు లేక ఎలక్ట్ర్రిక్ వాహానాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో వాటి కొరత తీర్చేందుకు పలు ప్ర్రైవేటు కంపనీలు కూడ ముందుకు వచ్చాయి.