పోలీస్ కస్టడీకి హాజీపూర్ కిల్లర్.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు..!
హైదరాబాద్ : నరరూప రాక్షసుడు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించేలా.. నల్గొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఓకే చెప్పింది. బుధవారం (08.05.2019) నాటి నుంచి 13వ తేదీ వరకు అనుమతించింది. ఆ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న నిందితుడిని బుధవారం నాడు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు రాచకొండ పోలీసులు.
హైదరాబాద్లో నడిరోడ్డుపై పేలిన రాయల్ ఎన్ఫీల్డ్.. వరుస ఘటనలతో వాహనదారుల్లో భయం (వీడియో)
అదలావుంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధిత కుటుంబాలు.. మంగళవారం నాడు మంత్రులను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు హోం మినిస్టర్ మహమూద్ అలీ, మరో మంత్రి ఈటల రాజేందర్. బాధితుల వెంట బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్ ఘటనపై విచారణ వేగవంతం అయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.