హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా భయంతో రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య - ఫ్యామిలీకి అంటొద్దనే - మియాపూర్‌లో ఘటన

|
Google Oneindia TeluguNews

కరోనా భయం ప్రజలను ఇంకా వెంటాడుతోంది.. దేశంలో కొవిడ్-19 పేషెంట్ల రికవరీ రేటు 80 శాతానికిపైగా ఉన్నప్పటికీ.. చదువుకున్నవాళ్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఓ రిటైర్డ్‌ జడ్జి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్

జడ్జిగా రిటైరైన రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్‌ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి కుటుంబంతో సహా డిన్నర్ చేసిన తర్వాత, తన బెడ్ రూమ్ లోకి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఎంతకీ తలుపు తెరవకపోవడంతో కుటుంబీకులు కంగారుతో తలుపులు బద్దలు కొట్టగా..

fearing-covid-19-retired-judge-ramachandra-reddy-commits-suicide-in-hyderabad

సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని విగత జీవిగా రామచంద్రారెడ్డి కనిపించారు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకుపోగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై జడ్జి కుటుంబం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి గదిని పరిశీలించిన పోలీసులకు అక్కడో సూసైడ్ నోట్ లభించింది. అందులో..

తనకు కరోనా సోకిందని భయంగా ఉందని, తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. జడ్జి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ జడ్జికి కరోనా ఉందా, లేదా అనే విషయం వెల్లడికావాల్సి ఉంది.

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్ బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

తెలంగాణ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2009 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంక్య 1.95లక్షలకు, మరణాల సంఖ్య 1145కు పెరిగింది. ఇప్పటివరకు కొవిడ్ బారి నుంచి 1.65లక్షల మంది కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 28,620గా ఉంది.

English summary
a Retired Judge Ramachandra Reddy committed suicide by hanging himself at home for fear of having covid-19 symptoms. The tragic incident took place at the Miyapur police station in Hyderabad on Friday. Ramachandra Reddy stated in the suicide note that he was committing suicide with the intention of not infecting the family members in the house because of him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X