ఇక షెడ్యూల్ ప్రకారమే బస్సులు: టికెట్ ధరపై కీలక ప్రకటన
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.
ఆర్టీసీ సరే.. అప్పుల ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తారా.. జస్టిస్ చంద్రకుమార్ లాజిక్తో కొట్టారుగా..!
ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా..
ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరుగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఛార్జీల పట్టక ప్రకారమే..
దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడారు. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తింపుతున్నామన్నారు. అయితే కొన్నిచోట్ల టికెట్ రేట్ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్గా నియమిస్తున్నట్లు చెప్పారు.
ఆ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు..
బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు. అదే విధంగా ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో... షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు.
బస్ పాసులు కూడా..
ప్రతి
గ్రామానికి
వెళ్లాల్సిన
బస్సులను
నడుపుతామన్నారు.
ఇక
ఆర్టీసీ
బస్సులన్నింటా
బస్పాస్లను
యదావిధిగా
అనుమతించాలని
ఆదేశాలిచ్చామన్నారు.
విద్యార్థులు,
వికలాంగులు,
పాత్రికేయులు,
ఉద్యోగులతో
పాటు
బస్పాసులన్నీ
అనుమతించాలని,
బస్పాస్లు
అనుమతించడం
లేదనే
ఫిర్యాదు
రావద్దని
మంత్రి
పువ్వాడ
ఆదేశించారు.
నాలుగు
రోజులుగా
ఆర్టీసీ,
ప్రైవేట్
బస్సులతో
పాటు
వివిధ
వాహనాలను
తిప్పి,
ప్రయాణీకులను
గమ్యస్థానాలకు
చేర్చామని,
ఇదే
రీతిన
తిరుగు
ప్రయాణానికి
కూడా
ఎలాంటి
ఇబ్బందులు
ఎదురాకుండా
అవసరమైన
చర్యలు
తీసుకున్నామన్నారు.
ప్రత్యేక
సర్వీసుల
సేవలన్నీ
వినియోగించుకుంటున్నట్లు
మంత్రి
అజయ్
పేర్కొన్నారు.
సమన్వయంతో రవాణా...
సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులన్ని పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమ్మె కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రవాణా సదుపాయాలు కల్పించామన్నారు. బుధవారం ఆర్టీసీ బస్సులు 3116, ఆర్టీసీ అద్దె బస్సులు 1933తో పాటు ప్రైవేట్ వాహనాలు తిరిగాయన్నారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టీ మరిన్ని వాహనాలను తిప్పుతామన్నారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు.