GHMC Election Results 2020: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం..సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్..
గ్రేటర్లో ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ కనిపిస్తోంది. డివిజన్ల వారీగా చూస్తే.. గాజులరామారంలో బీజేపీకి 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్కు 1 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి.
GHMC Exit polls : ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతాయా.. కారుకు రివర్స్ గేర్ తప్పదంటున్న బీజేపీ..
ఇక సూరారం డివిజన్ సంగతికి వెళితే టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి అత్యధికంగా 2 ఓట్లు ఉన్నాయి. పటాన్ చెరులో టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, భారతీనగర్ టీఆర్ఎస్ 3, బీజేపీ 4 వచ్చాయి. ఇక చింతల్ బీజేపీ 2, చెల్లనివి 2 ఓట్లు పోలయ్యాయి. జీడిమెట్ల టీఆర్ఎస్ 4, బీజేపీ 6, చెల్లనివి 1 ఓటు ఉంది. సుభాష్ నగర్ టీఆర్ఎస్ 9, బీజేపీ 3, చెల్లనివి 2 ఓట్లు వచ్చాయి. చంపాపేట బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 ఓటు ఉంది. లింగోజిగూడ బీజేపీ 5, టీఆర్ఎస్ 2, టీజేఎస్ 1 ఓటు ఉంది. వనస్థలిపురం బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1 వచ్చింది. హస్తినాపురం బీజేపీ 2 ఓట్లు ఉన్నాయి.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ 20 చోట్ల లీడ్లో ఉండగా.. టీఆర్ఎస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కొన్నిచోట్ల ఇప్పటివరకు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఓల్డ్ మలక్ పేట, గోషామహల్, రాంనగర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాలేదు. కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు రాలేదని.. ఇతరత్రా కారణాలను అధికారులు చెబుతున్నారు.