GHMC Election 2020 Live Updates: ఓల్డ్ మలక్పేట్లో సీపీఐ గుర్తు తారుమారు..ఆందోళనకు దిగిన సీపీఐ నాయకులు
హైదరాబాదు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే 9490617111కు సమాచారం అందించాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్లో 84, సైబరాబాద్లో 38, రాచకొండ పరిధిలో 28, నగర పరిధిలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను బందోబస్తులో మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూమ్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
గ్రేటర్లో పోలింగ్కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం...
తెలంగాణ
#CP_Rachakonda Sri. Mahesh Bhagwat IPS., #visited Vinayak Nagar 140 ward and #reviewed Bandobast #arrangements.#GHMCElections #GHMCElections2020 @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @CEO_Telangana @ECISVEEP pic.twitter.com/CLUoHXV1dr
— Rachakonda Police (@RachakondaCop) December 1, 2020