కేసీఆర్తో ఓవైసీ ఢీ:గ్రేటర్లో పొత్తులేదు -బీజేపీ నేతలకు నిద్రలోనూ నా పేరే -సిటీకి మోడీ ఏమిచ్చాడు?
''హైదరాబాదీలు టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్కు ఓట్లు వేస్తే అది మతతత్వ ఎంఐఎంకు వేసినట్లే.. అదే నేరుగా ఎంఐఎంకు ఓటు వేస్తే, విభజన వాదానికి ఓటు వేసినట్లే.. నగరానికి నిరంకుశ ఎంఐఎం మేయర్ కావాలో, స్వచ్ఛంగా పాలించే బీజేపీ మేయర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి..'' అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన కామెంట్లపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఒకవైపు బీజేపీని ఏకిపారేస్తూ.. మరోవైపు టీఆర్ఎస్ తో పొత్తులేదని ఆయన స్పష్టం చేశారు.
పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనం
నిద్రలోనూ నాపేరే..
‘‘బీజేపీ నేతలను నిద్రలేపి కొన్ని పేర్లు చెప్పమంటే ముందుగా నన్నే తలుచుకుంటారు. ఆ వెంటనే ఉగ్రవాదం, దేశద్రోహం, పాకిస్తాన్ పేర్లను పలవరిస్తారు. అభివృద్ధి పరంగా బీజేపీ చేసిందేమీ లేదు కాబట్టి మతం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగులైన యువకుల దృష్టి మళ్లించడానకే రాజ్యాంగ విరుద్ధమైన ‘లవ్ జీహాద్' లాంటి చట్టాలను తెస్తోంది'' అని ఓవైసీ ఫైరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మోదీ చేసింది శూన్యం..
ఇటీవలి వరదలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైన మాట నిజమే అయినా, వరదలతో తల్లడిల్లిపోయిన నగర ప్రజలకు మోదీ సర్కారు చేసిందేమీ లేదని ఓవైసీ అన్నారు. హైదరాబాదుకు బీజేపీ ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు మతం పేరుతో ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవని, ఆ పార్టీ ఎంత ప్రమాదకారో నగర ప్రజలకు బాగా తెలుసన్నారు. అసలు తెలంగాణకుగానీ, హైదరాబాద్ నగరానికిగానీ ఏం మేలు చేశారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
భార్య
సహా
17
మంది
అమ్మాయిలను
-ఆర్మీ
మేజర్
ముసుగులో
సంచలన
క్రైమ్
-
రూ.6కోట్లు
స్వాహా
Recommended Video
టీఆర్ఎస్తో ఎంఐఎం ఢీ
అధికార టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ప్రచారం చేస్తోన్న బీజేపీ నేతలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎంఐఎంకు టీఆర్ఎస్ తో పొత్తు లేదని, మజ్లిస్ పోటీచేస్తోన్న 52 కార్పొరేట్ డివిజన్లలో ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్సే అనే విషయాన్ని అందరూ గుర్తించాలని ఓవైసీ చెప్పారు. డిసెంబర్ 1న జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పటిలాగే జనం బీజేపీని ఓడించబోతున్నారని ఓవైసీ వ్యాఖ్యానించారు.