హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ వార్ ... రంగంలోకి దిగిన కవిత ... కాంగ్రెస్ , బీజేపీలకు ఆ హక్కు లేదంటూ ఫైర్

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మాటల తూటాలను పేలుస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నుండి కెసిఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఆమె మాట్లాడారు . టిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు కవిత . సోషల్ మీడియాలో పోస్టులతో , వీడియోలతో ఆదరగోడుతున్నారు.

తెలంగాణా సర్కార్ కు ఈసీ షాక్ ... ఎన్నికల కోడ్ అమల్లో ...తక్షణం వరద సాయం ఆపాలని ఆదేశంతెలంగాణా సర్కార్ కు ఈసీ షాక్ ... ఎన్నికల కోడ్ అమల్లో ...తక్షణం వరద సాయం ఆపాలని ఆదేశం

ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ .. ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉందో అందరికీ తెలుసు

ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ .. ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉందో అందరికీ తెలుసు

ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ ఎలా ఉండేది ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది అన్నది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు కవిత . కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ మార్గనిర్దేశంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్న కవిత, 65 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. అభివృద్ధిని కొనసాగించాలంటే టీఆర్ఎస్ కు ఓటెయ్యాలని కవిత పిలుపునిచ్చారు . హైదరాబాద్ అన్ని రంగాల్లో గత ఆరేళ్లుగా ప్రగతి సాధించిందని అలాంటి ప్రగతి పైఅపై మాటలతో రాదని పేర్కొన్నారు .

 కాంగ్రెస్ , బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ , బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ బిజెపిలకు జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు . నిరుపేదలైన వరదబాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపిలు పేద ప్రజల నోటికాడి ముద్దను లాక్కున్నాయి అని ఫైర్ అయిన కవిత జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీలు, నగర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

కరోనా వచ్చినా , వరదలు వచ్చినా అండగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వమే

కరోనా వచ్చినా , వరదలు వచ్చినా అండగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వమే

కరోనా వచ్చినా, వరదలు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉందని పేర్కొన్న కవిత, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆదుకుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోయాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీనగర్ నుండే టిఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొన్న కవిత గాంధీ నగర్ లో కనపడుతున్న అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు . గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Recommended Video

GHMC Elections 2020 : TTDP To Contest అన్ని చోట్లా పోటీ చేయము బలంగా ఉన్న చోట మాత్రమే : L Ramana
 ప్రచారం మొదలెట్టిన కవిత .... సోషల్ మీడియాలో కూడా కవిత పోస్టులు

ప్రచారం మొదలెట్టిన కవిత .... సోషల్ మీడియాలో కూడా కవిత పోస్టులు

టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ఎమ్మెల్సీ కవిత కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు . ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సంచలన పోస్ట్ లతో దుమ్ము రేపుతున్నారు. మరోపక్క గ్రేటర్ ఎన్నికల బాధ్యతను భుజాల మీద వేసుకుని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కూడా ప్రచారం మొదలు పెట్టారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు .

English summary
Kavitha was outraged that the Congress, BJP did not have the right to ask for votes in the GHMC elections. She was incensed that false propaganda was being made on purpose. BJP and congress had complained to the Election Commission when govt was helping the needy flood victims. Kavitha incensed that the opposition parties does not care about the problems of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X