హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూకట్‌పల్లిలో దారుణం... దుర్గామాత ఆలయంలో విధ్వంసం, శునకానికి ఉరి...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. స్థానిక దుర్గామాత ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పెకిలించివేశారు. ఆలయం వెలుపల వున్న నాగదేవత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయం పక్కనే ఓ శునకాన్ని ఉరివేసి చంపారు. ఘటన గురించి తెలియగానే మూసాపేట్ బీజేపీ కార్పోరేటర్ మహేందర్ అనుచరులతో కలిసి ఆలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. పలువురు భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని పోలీసులను ఆదేశించారు. ఆలయంలో తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి చేసేందుకు గాను రూ.5లక్షలు ప్రకటించారు.

goddess durga idol removed and naga devata idol vandalised in kukatpally

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలోనే... కూకట్‌పల్లిలోనూ అదే తరహా ఘటన వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

English summary
In a shocking incident unknow persons attacked a hindu temple in Kukatpally,Hyderabad.They removed goddess durga idol from the temple and vandalised Naga Devata idol,beside the temple a dog was hanged to death
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X