ప్రమాణస్వీకారానికి రానంటున్న రాజాసింగ్...! కారణమేంటో తెలుసా?
డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే నెల 11న రిజల్స్ట్ వచ్చాయి. అయితే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మాత్రం వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఎమ్మెల్యేల ప్రమాణానికి లైన్ క్లియరైంది. అదలావుంటే బీజేపీ నుంచి ఒకే ఒక్కడిగా గెలిచి రికార్డు సృష్టించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటానని ప్రకటించడం చర్చానీయాంశమైంది.
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గెలిచి నెల రోజులు దాటినా ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు ఎమ్మెల్యేలు. అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరిస్థితి వేరు. ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు పట్టం కట్టడమే ఆయన ఆగ్రహానికి కారణం. ముంతాజ్ ఎదుట ఎమ్మెల్యేగా తాను ప్రమాణం చేయబోను అనేది ఆయన శపథం. దీనికి సంబంధించి ఈనెల 6న ఓ వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రాజాసింగ్.