కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్... ఇంజనీర్ల ప్రతిభకు అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సంధర్భంగా ప్రాజెక్టు నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్న గవర్నర్ తక్కువ సమయంలో అద్బుత నిర్మాణం చేపట్టడడంపై ఆమె ఇంజనీర్లను అభినందించారు. అంతకుమందు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని గవర్నర్ తమిళసై దంపతులు దర్శించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారంనాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోని డెలివరి చానల్ వద్ద ఎగిసిపడుతున్న గోదావరి జలాలను ఆమె సందర్శించారు. ఈ నేపథ్యంలోనే కన్నెపల్లి పంప్హజ్ వద్ద నిర్మించిన ప్రాజెక్టు ఎత్తిపోతల తోపాటు ప్రాజెక్టు పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పనుల పరీశీలను వెళ్లారు.
అక్కడ నిర్మిస్తున్న గేట్ల నిర్మాణంతో పాటు అక్కడ నుండి వచ్చ వరద ప్రవాహం గురించిన అంశాలను ఇంజనీర్ ఇన్ చీఫ్ను అడిగి తెలుసుకున్నారు. కాగా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బయటి ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ది పనులను పరీశీలించడం ఇదే మొదటిసారి.