వంట గదిలో అనుకొని అతిథి.. చూసి పరుగుతీసిన వివాహిత...
హైదరాబాద్ : వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం అయ్యింది. టీ తాగుదామని అనుకొంది. వెంటనే వంట గదిలోకి వెళ్లింది. కానీ అక్కడ బుష్ అని శబ్ధం వినిపించింది. ఎంటా అని నిశీతంగా పరిశీలిస్తే తెలిసింది. నాగుపాము బుసలు కొట్టడంతో .. వంట గది నుంచి పరుగెత్తుకుంటూ బయటకొచ్చింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కందుకూరు మండలంలోని నేదునూరులో చిప్ప మనోహర్ దంపతులు ఉంటున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కటే వర్షం. వానపడుతుండగా .. టీ తాగుదామని అనుకొంది. వెంటనే కిచెన్ రూంలోకి వెళ్లింది. అయితే అప్పటికే ఓ అతిథి అక్కడ ఆశీనులైంది. తన ఉనికి తెలియాలని బుసలు కొట్టింది. ఏంటా అని నాగమణి అటు ఇటు చూసింది. అసలే వర్షం, మబ్బు కమ్ముకొని ఉంది. కిచెన్ రూంలో లైట్ వేసి .. చూడగా ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది. వంటగది ప్లాట్ ఫారం మీద నాగరాజు ప్రత్యక్షమయయ్యాడు. పడగవిప్పి ఉండటంతో ఆమెకు ఒళ్లు జల్లుమంది. నాగుపాము అని అరుస్తూ ఒక్కసారిగా వంటగది నుంచి బయటకు పరుగుతీసింది.
పాము గురించి తెలుసుకొని కుటుంబసభ్యులు హడలిపోయారు. ఇరుగు పొరుగు వారి సహకారంతో నాగుపామును బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు గంటపాటు వారితో నాగరాజు ఆడుకున్నాడు. తర్వాత కిటికీల్లోంచి వెళ్లిపోవడంతో .. కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా అంటూ రీలాక్స్ పొందారు.