హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ఆర్టీసీ బస్‌లో కాల్పులు , కలకలం రేపుతున్న సంఘటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగర నడిబొడ్డు పంజాగుట్టలో ఫైరింగ్ జరిగింది. ఆర్టీసీ బస్‌లో వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ కాల్పులకు కారణమైనట్టు తెలుస్తోంది. అయితే ఫైరింగ్ పై అటు బస్ డ్రైవర్ గాని ,ఇటు ఇతర వ్యక్తులు ఎవరు కూడ ఫిర్యాదు చేయలేదు. కాని మీడియా ద్వార విషయం తెలుసుకున్న పోలీసులు బస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు జరుపుతున్నారు.

హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలోని ఓ వ్యక్తి బస్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పంజాగుట్ట ప్రాంతం నుండి జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న బస్‌లో పంజాగుట్ట బస్ స్టాప్ వద్ద ఎక్కిన ప్రయాణికుడు మరో ప్రయాణికుడితో వాగ్వావాదానికి దిగినట్టు తెలుస్తోంది.

gun fire in RTC bus in hyderabad

ఇద్దరి మధ్య వాగ్వవాదం ఘర్షణగా తయారైంది.దీంతో ఎదుటి వ్యక్తిపై వెంటనే సదరు వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు .అనంతరం సాఫిగా అదే బస్సులో కొండాపూర్ వైపు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై ఘర్షనకు పాల్పడ్డ వ్యక్తి గాని, ఇతర వ్యక్తులు గాని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాని అదే బస్‌లో ప్రయాణిస్తున్న మీడియాకు సంబంధించిన వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

English summary
gun fire at panjagutta in hyderabad , and he escaped from the bus .There is a clash between the two passengers on the RTC bus. But on the firing-on-bus driver, or the other people did not even complain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X