ప్రేమికుడు కాదు కాలయముడు.. అపార్ట్మెంట్ నుంచి తోయడంతో...
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రేమించిన యువకుడే ప్రియురాలిని మట్టుబెట్టాడు. అపార్ట్మెంట్ మూడవ అంతస్తు నుంచి తోసేశాడు. ఆ యువతి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె చనిపోయిందని తెలిసి నిందితుడు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను రంగంలోకి దింపాయి.
మధ్యప్రదేశ్ నుంచి 15 రోజుల క్రితం ఒక జంట హైదరాబాద్ వచ్చింది. వనస్థలిపురంలో గల వాసవి నిలయం భవన నిర్మాణ పనుల్లో చేరారు. కొన్నాళ్లు బానే ఉన్న తర్వాత వారిలో మనస్పర్థలు వచ్చినట్టున్నాయి. భవన నిర్మాణం పనిచేసే చోట.. మూడో అంతస్తు నుంచి యువతిని తోసేశాడు. దీంతో ఆమెను తోటి కూలీలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయింది. దీంతో ఆందోళనకు గురైన యువకుడు కూడా పారిపోయాడు.
యువకుడు ఢిల్లీ పారిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అతనిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలను రంగంలోకి దింపారు. తాను ప్రేమించిన యువతిని యువకుడు ఎందుకు మట్టుబెట్టారనే అంశంపై క్లారిటీ రాలేదు. అతడు పట్టుబడితే తప్ప నిజనిజాలు వెలుగులోకి రావని పోలీసులు చెప్తున్నారు. వారి స్వస్థలం.. పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విషయాలు తెలియరాలేదు. భవన నిర్మాణ యాజమానిని కూడా వివరాలు ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. వారు ఎవరు, ఏంటో తెలియకుండా ఎలా పనిలో పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.