అప్పులు ఉంటే అభివృద్ది నిలిపి వేయాలా ..? ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై ప్రశ్నించిన కోర్టు
అసెంబ్లీ నిర్మాణంపై గత కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్న న్యాయ స్థానం పలు కీలక అంశాలపై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే, రోజువారి విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిన న్యాయం స్థానం భవన నిర్మాణంపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈనేపథ్యంలోనే ఎర్రమంజిల్ కూల్చివేతపై గురువారం కూడ వాదనలు జరిగాయి. దీంతో తెలంగాణకు ఇప్పటికే వేల కోట్లు అప్పులు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించడంతో కోర్టు స్పందించింది. అప్పులుంటే అభివృద్ది పనులు ఆపాలా అంటూ ప్రశ్నించింది. మరో వైపు రాష్ట్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాల్లో ఎలా జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. దీంతోపాటు అసెంబ్లీ నిర్మాణంపై పిటిషన్ వేసిన వారు ఆ భవనాన్ని నిర్మించిన నిజాం రాజుల్లాగా భావించవద్దని సూచించింది.
మరోవైపు బుధవారం జరిగిన విచారణలో కూడ నూతన అసెంబ్లీ భవనం నిర్మాణం జరిపితే తప్పేంటని పిటిషనర్ను ప్రశ్నించింది. గత కొద్ది రోజులుగా రోజువారి విచారణ జరుపుతున్న కోర్టు పలు అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తింది.