ఇప్పుడు ట్యాంక్బండ్ ఎలా ఉంది..? నెటిజన్లను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
ఎప్పుడూ నెటిజన్లతో టచ్లో మంత్రి కేటీఆర్ మరోసారి కలిసిపోయారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగారు. దీనికి నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. బాగుంది/ అలా చేయండి/ ఇలా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video
నెటిజన్లతో కలిసిపోయే మంత్రులలో కేటీఆర్ ఒకరు. సోషల్ మీడియా వేదికగా సమస్యలను పరిష్కరించడంలోనూ ముందుంటారు. ట్యాంక్ బండ్ పరిసరాల సుందరీకరణ పనులను తెలుపారు. దీనిపై నెటిజన్లను సూచనలు, సలహాలు అడిగారు. ట్యాంక్ బండ్ ఎలా ఉందో చెప్పాలని కోరారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికరమైన రిప్లై ఇస్తున్నారు. అలా చేయండి అంటూ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ యాక్టివ్గా ఉంటారు. పలువరు ట్వి్ట్టర్ వేదికగా సమస్యలను ప్రస్తావిస్తారు. వారికి కేటీఆర్ అండ్ టీ స్పందించింది. పలువురికి సహాయం కూడా చేశారు. ఆరోగ్య సమస్యలే కాదు.. ఇతర సమస్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. అలా చాలా మంది లబ్ది పొందారు. తర్వాత కేటీఆర్కు థాంక్స్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అభినందనలు కూడా తెలియజేశారు. ఇవాళ ట్యాంక్ బండ్ సుందరీకరణ గురించి మంత్రి కేటీఆర్ అడిగారు. సలహాలు/ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.