హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో దారుణం : అనుమానంతో భర్త ఎంతకు తెగించాడంటే..

|
Google Oneindia TeluguNews

వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. భార్యపై భర్తకు అనుమానం మొదలైంది. చీటికి మాటికీ వేధించడం మొదలుపెట్టాడు. భార్య ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఆమెను వేధించేవాడు. అనుమానం పెనుభూతమై.. ఇటీవల దారుణానికి తెగబడ్డాడు.

ఏం జరిగింది..

ఏం జరిగింది..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూరపాటి భార్గవ(36)కు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ప్రమీలకు 2009లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప,బాబు ఉన్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని మల్లాపూర్ సుభాష్‌నగర్‌లో ఉంటున్నారు.

అనుమానంతో విభేదాలు..

అనుమానంతో విభేదాలు..

భార్గవ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. ఏమైందో తెలియదు కానీ కొంతకాలంగా భార్గవ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. చీటికి మాటికీ ఆమెను వేధించేవాడు. పనికి వెళ్లాక ల్యాబ్ నుంచి ఫోన్ చేసి మరీ ఆమెతో గొడవపెట్టుకునేవాడు. అలా ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు..

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు..

ఇదే క్రమంలో ఈ నెల 15వ తేదీ రాత్రి భార్యతో భార్గవ మరోసారి గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేశాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆమె మృతదేహాన్ని సీలింగ్ ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుందని ప్రచారం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. విచారణలో భార్గవ నేరం అంగీకరించాడు. అనుమానంతో తానే హత్య చేసినట్టు తెలిపాడు.

 సంగారెడ్డిలో భర్తను హత్య చేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య..

సంగారెడ్డిలో భర్తను హత్య చేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య..


అనుమానాలు,వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చుపెడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ప్రియుడితో సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వెంకటమ్మ అనే మహిళ లక్ష్మమ్మ అనే మరో మహిళతో కలిసి భర్త వెంకటయ్యను హత్య చేసింది. హత్యానంతరం ఓ నిర్మానుష్య ప్రదేశంలో శవాన్ని పడేసి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకోక తప్పలేదు.

English summary
A man killed his wife over suspicion of extramarital affair,incident took place in Mallapur,Hyderabad. After murder he informed police that she committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X