ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో లేడీ టెక్కీ మృతి: శవంతో సెల్ఫీలు దిగిన యువకుడు, నెటిజన్ల ఫైర్
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు బీభత్స సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టడంతో.. ఆ స్కూటీపై వెళుతున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైంది. ఆమె మరణంతో స్థానికులు ఆగ్రహంతో బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్ను చితకబాదారు.
స్కూటీపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: టీసీఎస్ మహిళా ఉద్యోగి మృతి, డ్రైవర్ను చితకబాదారు
యువకుడి పైత్యం..
కాగా, ఓ యువకుడు మాత్రం తన సెల్ఫీ పైత్యాన్ని ప్రదర్శించి విమర్శలపాలవుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీసీఎస్ ఉద్యోగి సోహిని సక్సేనా మృతదేహం వచ్చేలా సెల్ఫీ తీసుకున్నాడు ఆ యువకుడు. ఓ వైపు అందరూ విషాదం, ఆగ్రహంతో ఉంటే.. ఇతడు మాత్రం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకుని పైత్యాన్ని చాటుకున్నాడు.
నెటిజన్ల ఫైర్..
కాగా,
యువకుడు
సెల్ఫీ
తీసుకుంటుండగా
అతని
ఫొటోను
కొందరు
ఫొటోలు
తీసి
సోషల్
మీడియాలో
పోస్టు
చేశారు.
దీంతో
ఆ
యువకుడిపై
నెటిజన్లు
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నారు.
ఇంత
మానత్వం
లేకుండా
శవంతో
ఫొటోలు
తీసుకోవడం
ఏంటని
మండిపడుతున్నారు.
తాత్కాలికంగా డ్రైవర్ నిర్లక్ష్యంతో..
మంగళవారం మధ్యాహ్నం సోహిని సక్సేనా మాసబ్ ట్యాంక్ నుంి బంజారాహిల్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె ముందు వెళుతుండగా ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఆమెపై నుంచి దూసుకెళ్లి రోడ్డు మధ్యలోని డివైడర్ వద్ద ఉన్న స్తంభాన్ని ఢీకొంది.
తాత్కాలిక డ్రైవర్లతో పెరుగుతున్న ప్రమాదాలు..
మహిళ మృతదేహంతో స్థానికలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. తాత్కాలిక డ్రైవర్ల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా మాసబ్ ట్యాంక్-పంజాగుట్ట, మెహిదీపట్నం మార్గాల్లో భారీగా ట్రిఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రైవేటు వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం నడిపిస్తున్న విషయం తెలిసిందే.