కూకట్పల్లిలో కారు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం, ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆటో, బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సౌత్ ఇండియా మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
టీఎస్ 06 జీఈ 6999 అనే నెంబర్ గల కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారు, ఆటో, ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో నాలుగు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు.
యువకుడ్ని
చితకబాదిన
హిజ్రాలు
వినాయక
నిమజ్జనం
సమయంలో
హిజ్రాలతో
ఓ
యువకుడు
అసభ్యంగా
ప్రవర్తించడంతో..
విసుగు
చెందిన
హిజ్రాలు
అతడిపై
దాడి
చేయడంతో
అక్కడ్నుంచి
పారిపోయాడు.
సెప్టెంబర్
1న
హైదరాబాద్
ట్యాంక్బండ్పై
జరిగిన
ఈ
ఘటన
ఆలస్యంగా
వెలుగులోకి
వచ్చింది.
దాడి
దృశ్యాలు
సమీపంలోని
సీసీ
కెమెరాల్లో
రికార్డయ్యాయి.
ఈ
ఘటనపై
ఎలాంటి
ఫిర్యాదు
అందకపోవడంతో
కేసు
నమోదు
కాలేదు.