హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా...
హైదరాబాద్లోని
దుర్గం
చెరువుపై
నిర్మించిన
కేబుల్
బ్రిడ్జి
ప్రారంభోత్సవం
వాయిదా
పడింది.
ఈ
నెల
19న
సాయంత్రం
5గంటలకు
మంత్రి
కేటీఆర్
ఈ
బ్రిడ్జిని
ప్రారంభిస్తారని
రెండు
రోజుల
క్రితమే
అధికారులు
వెల్లడించారు.
అయితే
ప్రస్తుతం
నగరంలో
వర్షాలు
కురుస్తున్న
నేపథ్యంలో
బ్రిడ్జి
ప్రారంభోత్సవం
వాయిదా
పడింది.
కాగా, కొద్దిరోజుల క్రితమే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. దాదాపు రూ.184కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45-ఐటీ కారిడార్ను అనుసంధానం చేయనుంది. దీని పొడవు 754.38మీ. కాగా.. వెడల్పు ఆరు లేన్లు ఉంటుంది. ఎల్&టీ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించింది. దేశంలో కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.
పాదాచారులు,సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ రాత్రి సమయంలో బ్రిడ్జి అందాలను రెట్టింపు చేయనుంది. ఈ బ్రిడ్జిపై రాకపోకలను ప్రారంభించనప్పటికీ... ఇప్పటికీ ఎంతోమంది సందర్శకులు ప్రతీరోజూ ఇక్కడికి వచ్చిపోతున్నారు. రాత్రిపూట జిగేల్ కాంతుల నడుమ బ్రిడ్జి పైనుంచి చెరువు అందాలను వీక్షిస్తూ మైమరిచిపోతున్నారు. ఒకరకంగా నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ బోటింగ్, రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో టూరిజం శాఖ ఉన్నది.
ఒకప్పుడు కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ నవాబులకు మంచి నీరందంచిన చరిత్ర దుర్గం చెరువుకు ఉన్నది. దాదాపు 83 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు దేశంలోని రహస్య తటాకాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది.