శంషాబాద్లో బంగారం పట్టివేత.. బెదిరించి స్ల్మగ్లింగ్ చేయించారంటూ ఆవేదన...!
వారంత బంగారం స్మగ్లర్లు, రెండు కోట్ల రుపాయల బంగారాన్ని జెడ్డా నుండి స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పట్టుపడ్డ బంగారం మాది కాదని చెబుతున్నారు. తాము ఉమ్రాకు వెళ్లిన నేపథ్యంలో అక్కడి స్మగ్లర్లు బంగారం తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారని , లేదంటే ఉమ్రా యాత్రకు వచ్చారంటూ స్థానిక పోలీసులకు అప్పచెబుతామని బెదిరించారని చెబుతున్నారు. దీంతో స్మగ్లింగ్లో ట్విస్ట్ కొనసాగుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ పోలీసులతోపాటు డిఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈనేపథ్యంలోనే జెడ్డా నుండి వచ్చిన 14 మందిని కూడ అరెస్ట్ చేశారు..కాగా అరెస్ట్ చేసిన వారంతా హైదరాబాద్కు చెందిన వారు కావడం గమనార్హం. దీంతో పట్టుపడ్డ నిందితులు చెబుతున్న వివరాలు ట్విస్ట్ కొనసాగుతుంది.
పాతబస్తికి చెందిన 14 మంది ఉమ్రా యాత్రకు వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడంతో స్థానిక బంగారం స్మగ్లింగ్ ముఠాలు తమను బెదిరించి బంగారం స్మగ్లింగ్ చేయాలని బెదిరించి పంపించినట్టు వారు చెప్పారు.లేదంటే ఉమ్రా పోలీసులకు అప్పజెప్పుతామని అందుకే తాము బంగారాన్ని తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో చెప్పారు..దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు.