రాగం తానం పల్లవి పేరుతో ప్రముఖ విద్వాంసులు సాకేతరామన్ ఆన్లైన్ కచేరి..వివరాలు
ప్రముఖ కర్నాటక్ సంగీత విద్వాంసులు సాకేతరామన్ సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్కు సంబంధించి 62వ యానువల్ ఫెస్టివల్ కార్యక్రమంలో డిజిటల్ కాన్సర్ట్ ప్రదర్శన ఇవ్వనున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం 6 గంటలకు సాకేత్రామన్ ఈ ప్రదర్శన ఇవ్వనున్నారు.పద్మభూషణ్ లాల్గుడి జయరామన్కు ప్రియ శిష్యుడైన సాకేత రామన్ "రాగం తానం పల్లవి" కార్యక్రమంను ప్రదర్శించనున్నారు.
కర్నాటక సంగీతంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం గడించిన విద్వాంసులు సాకేతరామన్. తన పదాల ద్వారా జీవం పోసే గొప్ప చాతుర్యం ఉన్న విద్వాంసులు సాకేతరామన్. సంగీతంకు తన పదాల ద్వారా జీవం పోయగల సామర్థ్యం ఉన్న విద్వాంసులు సాకేత రామన్.
సంచారి భవ లేదా నిరావల్ అనే ప్రదర్శన ఇవ్వనున్నారు సాకేతరామన్. అంటే ఈ సంగీతానికి మయూరి నృత్యం చేస్తుందని చెబుతారు. విద్వాన్ సాకేతరామన్తో పాటు ఎల్. రామకృష్ణన్ వాయోలిన్ వాయస్తారు. మృదంగంపై విజయ్ నాటేశన్, ఘటంపై డాక్టర్ కార్తీక్ సహకారం అందిస్తారు. వీరంతా కూడా విద్వాంసులే.
2020 డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రదర్శన ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. దీన్ని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. మరింత సమాచారం కోసం 9849124675,9440884863 నెంబర్లపై సంప్రదించగలరు.