వామ్మో.. ఇదేంది.. కల్నల్కే దొరకని రసీదు.. తప్పని ఆగచాట్లు..
కరోనా రక్కసి వల్ల పరిస్థితులే మారిపోయాయి. ఎక్కడ, ఎవరు, ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఒకరు ఒకరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సాధారణంగా చనిపోయిన అదే సిచుయేషన్. అయితై హైదరాబాద్లో ఇటీవల ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన సత్యబ్రొటో దాస్ గుప్తా చనిపోయారు. ఆయనది సాధారణ మరణమే.. కానీ డెత్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడ్డారు. శత్రుదేశ సైనికులను మట్టుబెడుతోన్న కల్నల్కే చుక్కలు చూపించారు ఇక్కడి సిబ్బంది.
సాధారణ మరణం
సైనిక్ పురిలో గల భరణి కాలనీలో సత్య ఉండేవారు. ఇతను ఆర్మీలో పనిచేసి రిటైర్ కాగా.. ఇతని కుమారుడు కల్నల్గా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన తన ఇంటి వద్దే కన్నుమూశారు. తనతో 50 ఏళ్ల సంసారం చేసిన భార్యతో.. తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని.. చెప్పి నవ్వుతూ చనిపోయారు. ఇప్పటివరకు ఓకే.. తర్వాతే సీన్ మారింది. ఇతని కుమారుడు కల్నల్ జోయంతా జమ్ము కశ్మీర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అంత్యక్రియల తంతు ముగిసింది. కానీ ఆయనకు రసీదు మాత్రం ఇవ్వలేదు. వాస్తవానికి శ్మశాన సిబ్బంది రిసిట్ ఇస్తేనే డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో కల్నల్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు.
డెత్ సర్టిఫికెట్ కోసం కొర్రీ
నేరెడ్ మెట్లో గల భరణి కాలనీ శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. డెత్ సర్టిఫికెట్ కోసం వైద్యుడిని కల్నల్ సంప్రదించాడు. ఇస్తాను కానీ.. రసీదు కావాలని చెప్పాడు. ఆ రిసిట్ కోసం కల్నల్ ట్రై చేశాడు. అయితే వారు అతనికి షాక్ ఇచ్చారు. కరోనా వల్ల మృతదేహలు ఎక్కువ వస్తున్నాయని.. రిసిప్ట్ ఇవ్వలేమని చెప్పారు. దీంతో తల పట్టుకోవడం అతని వంతయిపోయింది.
ఇక జనం సంగతి
కల్నల్ స్థాయి అధికారే ఇలా ఉంటే మిగతావారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాన్ని సిబ్బంది పట్టించుకోరనేది అర్థం చేసుకోవచ్చు. సామాన్యులు చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అసలే కరోనా సమయం కావడంతో.. తిరిగి తిరిగి బేజారు కావాల్సిన పరిస్థితి వస్తోంది.