స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎలా వెళ్లాలంటే ..
హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భాగ్యనగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. తాము సూచించిన రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. అత్యవసరంగా బయలుదేరాల్సిన వారు ముందే ట్రాఫిక్ ఆంక్షలు చూసుకోని బయలుదేరాలని కోరుతున్నారు.
ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్ గూడ గోల్కొండ కోటకు వెళ్లే రహదారిని మూసివేస్తారు. అయితే ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు ఏ, బీ, సీ స్టిక్కర్స్ ఉన్న వీఐపీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్ే ఏ, బీ, సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెప్ట్ టర్న్ తీసుకొని .. బాలిక భవన్, ఆంధ్రా ప్లోర్ మిల్స్, ఫ్లై ఓవర్ లంగర్ హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్ గూడ్ రైట్ టర్న్తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్టుకు చేరుకోవాలని సూచించారు.
పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ను బ్రూక్ బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.