హైద్రబాద్ నగర శివారులో మళ్లి ఐసిస్ కదలికలు, సానుభూతి పరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు
హైద్రబాద్ లో శివారు గ్రామాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు, దీంతో మరోసారి తీవ్రవాదుల కదలికలు ఏమైన ఉన్నాయా అనుమానం చెలరేగుతోంది. హైద్రాబాద్ లోని ఉదయం నగరశివారులోని మైలార్ దేవ్ పల్లి ఐసిస్ సానుభూతిపరుడు ఇంటితోపాటు పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎనిమిది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాగా గతంలోనే మైలార్ దేవ్ పల్లిలోని కొద్దిమంది యువకులు ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ,ఐసిస్ లో చేరకుండా ఆపారు. మరోసారి ఐసిస్ సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా అధికారుల సోదాలు కళకలం రేపుతున్నాయి.
దీంతో గతంలో సానుభూతిపరులుగా ఉన్నవారు మళ్లి ఐసిస్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారా అనే అనుమానాలు రేకెత్తున్నాయి. లేదంటే పాత కేసుల్లో ఏమైన పురోగతి కోసం పోలీసుల సోదాలు కొనసాగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద లోకల్ పోలీసులు సహయంతో నాలుగు బృందాలు గా విడిపోయి సోదాలు కొనసాగించినట్టుగా తెలుస్తోంది.