రిలాక్స్ మూడ్లో జగన్ ! అవెంజర్స్ ఎండ్గేమ్ వీక్షణ
రెండు మూడు నెలలపాటు ఎన్నికల్లో హోరాహోరి ప్రచారం ,నువ్వానేనా అంటూ ప్రచారంలో నేతలు మునిగిపోయారు . కనీసం కుటుంభాలను సైతం పట్టించుకోకుండా ప్రచారం కొనసాగించిన నాయకులు సైతం ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మొదటి దశలోనే ముగిశాయి. దీంతో ఫలితాలకు సైతం మరో ఇరవై రోజుల సమయం ఉంది. దీంతో ఎపీ పార్టీ అధినేతలు , నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు.
ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఓ హలివుడ్ సినిమా చూశారు. ఇటివల విడుదలై కలెక్షన్లలో రికార్డులు బద్దలుకొడుతున్న ''అవెంజర్-ఎండ్ గేమ్'' సినిమాను హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చూశారు. సాధరణ పౌరుడిలాగా వచ్చిన జగన్ తన స్టైల్లో అందరిని పలకిరించాడు.
కాగా ఇటివలే జగన్ కుటుంభసభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం వేసవి విడిది ప్రాంతాలకు వెళ్లారు. రాజకీయాలను పక్కన పెట్టి ఆయన తన కుటుంభ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి వచ్చారు. మొత్తం ఇలా విఐపిలు, వీవీఐపీలు సైతం ఓవైపు రాజకీయా వేడి, మరోవైపు వాతవరణంలో మార్పులకు దూరంగా టూర్ లకు వెళ్లివస్తున్నారు.