పుల్వామా ఉగ్రదాడి : అమరజవాన్లకు నివాళి.. 50 లక్షలు అందించిన కేటీఆర్
హైదరాబాద్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. జూబ్లిహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు 50 లక్షల రూపాయల చెక్కును అందించారు.
వ్యక్తిగతంగా తాను 25 లక్షల రూపాయలు ఇవ్వగా.. మరో 25 లక్షల రూపాయలు ఆయన స్నేహితులు ఇచ్చినట్లు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తనను కలచివేసిందన్నారు. సైనికుల వల్లే మనం క్షేమంగా ఉండగలుగుతున్నామని వ్యాఖ్యానించారు.
It was my privilege & honour to visit the HQ CRPF southern sector & offer tributes to #PulwamaMartyrs 🙏
— KTR (@KTRTRS) February 17, 2019
As a token of my respect, in my personal capacity handed over cheque of ₹25 lakhs & also ₹25 lakhs from few friends who volunteeredhttps://t.co/s2Feq9W3C2 pic.twitter.com/JkppT2jJfe