హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాయర్లు వామన్ రావు దంపతుల హత్యకేసు ... కుంట శ్రీనివాస్ తో పాటు నిందితుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతుల జంట హత్యల వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువగా మారాయి. గట్టు వామన్ రావు దంపతులను పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్ కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు కుంటా శ్రీనివాస్ ను పట్టుకున్నారు.

మహారాష్ట్ర సరిహద్దుల్లో నిందితుల అరెస్ట్

మహారాష్ట్ర సరిహద్దుల్లో నిందితుల అరెస్ట్

ఈనెల 17వ తేదీన వామన్ రావు దంపతులను అత్యంత దారుణంగా హతమార్చారు. ఆరు బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు, ఈ హత్యకు సంబంధించి కుంటా శ్రీనివాస్, కిరణ్, కుమార్ లను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వామన్ రావు దంపతులను హత్య చేసిన తర్వాత నిందితులను మహారాష్ట్ర సరిహద్దులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వామన్ రావు దంపతుల కదలికలను కుమార్ రెక్కీ నిర్వహించాడని, శ్రీనివాస్ కు సమాచారం అందించారని తెలుస్తుంది . శ్రీనివాస్ తో పాటు కిరణ్ ను, అక్కపాక కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు .. రాత్రి మీడియా ముందుకు

ఇప్పటికే ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు .. రాత్రి మీడియా ముందుకు

ఇంతకు ముందు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు . చిరంజీవి, కుమార్, దాస్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వారిని విచారిస్తున్నారు.
ఇక ఈ రోజు రాత్రి వీరిని మీడియా ముందుకు తీసుకు వచ్చే అవకాశం కూడా ఉంది. దేవాలయ భూముల కు సంబంధించిన వివాదమే హత్యకు దారితీసిన ట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే దేవాలయ భూముల కు సంబంధించిన వివాదం చిన్న విషయమని, వామన్ రావు దంపతుల హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.

వామన్ రావు దంపతుల హత్య వెనుక రాజకీయ నాయకులు .. మృతుని కుటుంబం ఆరోపణ

వామన్ రావు దంపతుల హత్య వెనుక రాజకీయ నాయకులు .. మృతుని కుటుంబం ఆరోపణ


వారి హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, వారిని తక్షణం అదుపులోకి తీసుకొని, తగిన శిక్ష విధించాలని మృతుని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాదుల జంట దారుణ హత్యకు నిరసనగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మంథని బంద్కు పిలుపునిచ్చారు. మంథని లో బంద్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు న్యాయం చేయాలని, ఈ కేసును సిట్టింగ్ జడ్జితో తక్షణం విచారణ జరిపించాలని ఆందోళన నిర్వహించారు.

English summary
It is learned that Kunta Srinivas, Kiran and Kumar have been arrested in connection with the murders of highcourt lawyers couple. It is learned that the accused were arrested at the Maharashtra border after the murder of Vaman Rao couple. It is learned that Kumar gave information to srinivas on Vaman Rao couple movements. Along with Srinivas, Kiran and Akkapaka Kumar were arrested by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X