హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి కూడా స్పెషల్ బస్సులు సిద్ధం చేశారు అధికారులు. 1300 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తున్న ఆర్టీసీ.. మంగళవారం (09.04.2019) నుంచి 300 బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపిస్తున్నారు.

తెలంగాణ వీరప్పన్ ఖేల్ ఖతం..! పోలీసులకు చిక్కిన ఎడ్ల శ్రీను.. ఇక అడవులు సేఫా?తెలంగాణ వీరప్పన్ ఖేల్ ఖతం..! పోలీసులకు చిక్కిన ఎడ్ల శ్రీను.. ఇక అడవులు సేఫా?

lok sabha elections tsrtc runs 1300 special buses

బుధవారం (10.04.2019) నుంచి మరో 900 స్పెషల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికలు జరిగే గురువారం 11వ తేదీ ఉదయం నుంచి మరో 100 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్ లో నివసిస్తుండటంతో అటువైపు కూడా స్పెషల్ బస్సులు వేశారు. అక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ లో నివసించేవారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఆ క్రమంలో ఎంజీబీఎస్‌ నుంచే కాకుండా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, అమీర్‌పేట్ తదితర ఏరియాల నుంచి కూడా స్పెషల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

English summary
TSRTC running about 1300 special buses from hyderabad to different places of ap and telangana. Overall 1300 special buses alloted in the view of election time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X