పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది
శంషాబాద్ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
పిల్లోనిగూడ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఓ యువజంట విగతజీవులుగా కనిపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా వారు ప్రేమికులుగా తేలింది.
కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?
నందిగామ మండలం పిట్టలగూడేంకు చెందిన శ్రవణ్ డిగ్రీ చదువుతున్నాడు. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన మయూరి ఇంటర్మీడియట్ చదువుతోంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న శ్రవణ్, మయూరి తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టమ్ నిమిత్తం వారి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.