తెలంగాణలో తగ్గని కరోనా కేసులు: గ్రేటర్లోనే సింహభాగం పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. యావరేజిగా రోజుకు 4 వేల వరకు కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 40 వేల 414 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3877 మందికి పాజిటివ్ వచ్చింది. ఒమిక్రాన్.. చైనాలో కొత్త వైరస్ వార్తలతో హై టెన్షన్ నెలకొంది. తాజా కేసులతో కలిసి మొత్తం కేసుల సంఖ్య 7,54,976కి చేరింది.
వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. గత 24 గంటల్లో 2981 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్ నుంచి 7,10,479 మంది కోలుకున్నారు. మరో 40,414 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు ఎక్కువే ఉంది. 94.11 శాతంగా ఉంది. ఇటు గ్రేటర్లో 1189 మందికి పాజిటివ్ వచ్చింది. కేసుల్లో సింహాభాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్నాయి. మేల్చల్ జిల్లాలో కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే కరోనా, ఒమిక్రాన్ ఓకేలా చూస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.