హైదరాబాద్లో కాల్పుల కలకలం: గాల్లోకి ఆర్మీ జవాన్ ఫైరింగ్, రంగంలోకి పోలీసులు..
హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. నార్సింగ్ హైదర్ షాకోట్లో ఆర్మీ మాజీ జవాన్ కాల్పులు జరిపాడు. గాల్లోకి కాల్పులు జరపడంతో చుట్టూపక్కల జనం ఆందోళన చెందారు. అయితే ఇంటి పక్కనగల కొందరు అరవడంతో విసిగి వేసారి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. స్ధానికుల సమాచరంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
కాలనీలో గురువారం గణేశ్ నిమజ్జనం జరుగుతోంది. అయితే అక్కడ ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారు. తాగి, తందనాలు ఆడటంతో ఆర్మీ జవాను విసుగొచ్చింది. గొడవ చేయొద్దని ఒకటికీ రెండుసార్లు కోరాడు. అయినా వారు వినిపించుకోలేదు. ఇక చేసేదేమీ లేక తన గన్ తీశాడు. రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో మందు పార్టీ చేసుకున్న వారితోపాటు.. నిమజ్జనంలో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని ఆరాతీశారు.
Recommended Video
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ మాజీ అధికారి నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేశారు. ఆర్మీ నిబంధనల ప్రకారం సైనికులు/రిటైర్ సైనికులపై కేసు నమోదు చేయరాదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని పోలీసులు చెబుతున్నారు.