రేవంత్ రెడ్డి తన విలువను చెడగొట్టుకున్నాడు : జగ్గారెడ్డి
హుజుర్నగర్ ఎమ్మెల్యే ఎంపిక విషయంలో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి అనవసరంగా తన స్థాయిని దిగజార్చుకున్నాడని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అభ్యర్థి ఎంపికపై మాట్లాడి ఆయనకు పార్టీలో ఉన్న విలువ కూడ చెడగొట్టుకున్నాడని ఆయన తెలిపారు. ఈ సంధర్భంలోనే రేవంత్ రెడ్డి పీసీసీ స్థాయిలో ఎదిగాడని చెప్పారు. అలాంటీ సందర్భంలో పార్టీ నేతల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బందుల్లో పడ్డాడని ఆయన చెప్పారు.
మరోవైపు ఇటివల మంత్రి హరీష్ రావును కలిసిన అంశంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన ఆయన మరోసారి అభివృద్ది పనుల కోసమే మంత్రి హరీష్ రావుతో భేటి అయినట్టు ఆయన తెలిపారు. భేటిలో ఇద్దరి మధ్య లాబియింగ్ లేదని తెలిపారు. ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఎవరికి వారే పోటి చేయునున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో విజయంగా ప్రచారం కొనసాగుతోందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావు సంగారెడ్డిలో ప్రచారం చేసిన తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
కాగా 14 ఎళ్లపాటు హరీష్ రావు, జగ్గారెడ్డిలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇన్ని రోజుల రాజకీయ శత్రుత్వానికి ఫుల్ స్టాప్ పెడుతూ మంత్రి హరీష్ రావుతో జగ్గారెడ్డి భేటి అయిన విషయం తెలిసిందే... దీంతో ఇద్దరి భేటి హట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే జగ్గారెడ్డి మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశారు.