500 మందు బాబులకు ఒకేరోజు శిక్ష... నాంపల్లి కోర్టు సిరియస్
ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సాయంత్రం ఆరు గంటలకే తనిఖీలు చేసి వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మందుబాబుల్లో మార్పులు రాకపోవడంతో కేసులు నమోదు చేసి కోర్టులకు తరలిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సాధరణంగా జరిమానాలు వేసి పంపించే కోర్టు ఏకంగా ఒకే రోజు 480 మంది మందుబాబులకు నాంపల్లి కోర్టు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే 62 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయగా, 31 మందికి మూడు రోజుల శిక్ష విధించింది. కాగ 142 మంది రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మరో 257 మందికి కోర్టు సమయం ముగిసే వరకు నిలబడి ఉండాలని నాంపల్లి కోర్డు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
సో ఇప్పటికైన మందు బాబులు డ్రంకెన్ డ్రైవ్ చేసేవారిలో మార్పు వస్తుందా లేదంటే షరామామూలుగానే కేసులు నమోదవుతాయా వేచి చూడాలి. ఏది ఏమైన పోలీసులు గతంలో వారంతంలో తనిఖీలు చేసే పోలీసులు ప్రస్థుతానికి అకస్మాత్తుగా తనిఖీలు చేస్తుండడంతో పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడుతున్నారు.