క్యాబ్ ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక పోలీసులు
హైదరాబాద్లో క్యాబ్లు రవాణ వ్యవస్థలో అంత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి ప్రయాణం, భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు ఏర్పాటు చేశారు.. క్యాబ్ల్లో వెళ్లే ప్రయాణికులు ఎదైన ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కాని, ప్రమాదంలో ఉన్నప్పుడు కాని వెంటనే స్పందించే విధంగా అత్యవసర వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహానాలు ప్రత్యేకంగా ప్రైవేట్ వాహానాలకు అనుసంధానమయ్యో విధంగా పోలీసుశాఖ మరో యాప్తో వాహానాలను పోలీసుశాఖ ప్రారంభించింది.
మద్యం తాగించి యువతిపై క్యాబ్ డ్రైవర్, ప్రయాణీకుడు రేప్
ఈ సాంకేతికత ద్యార పెట్రోలింగ్ వాహానాలు క్యాబ్ ఉపయోగించే యాప్తో కనెక్ట్ అవుతుంది. దీంతో ప్రయాణికులు ప్రయాణిస్తున్న క్యాబ్ కంట్రోల్ రూంతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహానాలకు కూడ సమాచారం అందిస్తుంది. దీనివల్ల ఎదైన ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ వాహానాలు ప్రారంభించిన సంధర్భంగా డీజీపీ మహెందర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను నేర రహితంగా తీర్చీదిద్దేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రయాణికుల భద్రత కోసం అనేక యాప్లు రూపోందించామని చెప్పారు. తాజాగా రూపోందించిన యాప్ ప్రవైట్ క్యాబ్స్తో పెట్రోలింగ్ వాహనాలను అనుసంధానం చేశామని చెప్పారు.