హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహిస్తుంది. నల్గొండ, కామారెడ్డి ,జనగామ జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుండి నమూనాలు సేకరించి సర్వే చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు.

కరోనా కొత్త ట్రెండ్ .. పిల్లల్లో కరోనా సోకిన మూడు, నాలుగు వారాలలో కూడా ప్రభావంకరోనా కొత్త ట్రెండ్ .. పిల్లల్లో కరోనా సోకిన మూడు, నాలుగు వారాలలో కూడా ప్రభావం

దేశ ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తి , దాని తీరు తెన్నులు తెలుసుకోవడం కోసం ఐసీఎంఆర్ చేపట్టిన సర్వేలో భాగంగా జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ సర్వే కొనసాగుతుంది. నల్గొండ ,కామారెడ్డి , జనగామ జిల్లాలలో ప్రాథమిక దశ సర్వే నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్న తొలిరోజుల్లో నిర్వహించిన సర్వే సమయంలో జనగామలో రెండు కేసులు, కామారెడ్డి నల్గొండ జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి.

NIN, Telangana Govt joint Survey in Telangana districts on corona spread

Recommended Video

NCB కి సహాయం చేస్తా అన్న Kangana Ranaut.. అదే జరిగితే వాళ్ళందరూ జైలు కెళ్తారు || Oneindia Telugu

ప్రస్తుతం రెండవ దశలో ఒక్కో జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుంచి సొమ్ము నమూనాలు సేకరించి కరుణ వైరస్ ఏమేరకు వ్యాప్తి చెందింది. ఏ వయసు వారిలో ఎక్కువగా వ్యాప్తి కనిపిస్తుంది. ప్రాథమిక సర్వే అప్పుడు పరిస్థితి ,ఇప్పుడు సర్వే నిర్వహించే నాటి పరిస్థితికి తేడా ఏంటి ? వంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. జనగామ నల్గొండ కామారెడ్డి జిల్లాలో 5 శాతం మేరకు వ్యాప్తి జరిగినట్లు సర్వేలో నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా. ఐదుగురు సభ్యులు చొప్పున పదిహేను బృందాలతో మూడు రోజులపాటు సర్వే నిర్వహించి వ్యాప్తిపై సర్వే ఆధారంగా, ఒక అంచనాకు వస్తామని జాతీయ పోషకాహార సంస్థ నుండి సర్వే కొరకు వచ్చిన యంత్రాంగం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వీరితో కలిసి సంయుక్తంగా, కరోనా వ్యాప్తి పై సర్వేను కొనసాగిస్తోంది.

English summary
It is known that National institute of nutrition along with telangana government conducting a Survey to assess the impact of corona virus. The survey first phase was conducted in kamareddy , nalgonda and janagaon and the second phase also conducting in the same districts collecting 1200 samples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X