వీడియో వైరల్: పానీ పూరీ తిందామనుకుంటున్నారా...ఇది చూశాక డిసైడ్ చేస్కోండి..!
హైదరాబాదు: ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి తీసుకుంటున్న ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎటు చూసినా జంక్ ఫుడ్ ఎక్కువైపోతోంది. యూకేలో ఓ టీనేజీ కుర్రాడు జంక్ ఫుడ్ కొన్నేళ్ల పాటు తీసుకోవడంతో ఏకంగా చూపును, వినికిడి శక్తిని కోల్పోయినట్లు చూశాం. ఈ విషయాన్ని స్వయంగా వైద్యులే చెప్పారు. ఇక రోడ్డు పక్కన పానీపూరీ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సిందే. నోరూరించే పానీ పూరీ వెనక దాని తయారీ వెనక చూస్తే కడుపులో దేవేస్తుంది. బయట తినేసమయంలో లొట్టలేసుకుని తింటాం. కానీ దాని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే.. ఛీ ఛీ ఈ చెత్తను ఇంతకాలం కడుపులో వేసుకుంటున్నామా అని అనుకోక మానరు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణీకుడు మిస్సింగ్.. ఇంతకు ఏం జరిగిందంటే..!
పానీ పూరీ తిందామనుకుంటున్నారా అయితే జాగ్రత్త..?
సాయంత్రం అయ్యింది... ఏదైనా స్నాక్స్ తిందామని పానీపూరీ బండి వైపు చూస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త. పానీ పూరీ చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. ఇక తింటే ఆ టేస్టే వేరు. ఒక్క ప్లేటుతో సరిపెట్టుకోలేం. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. కానీ ఎంత తింటే అంత ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామన్న సంగతి గ్రహించి ఉండరు. పానీ అంటే నీరు. పానీ పూరీలో ఈ పానీనే ప్రధానం. ఈ నీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. చిన్నపిల్లలకు పానీ పూరీ తినిపిస్తే కడుపు నొప్పితో పాటు ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
పానీ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ పానీపూరీ వ్యాపారి పానీ తయారు చేస్తున్నాడు. అది చూసిన వారికెవరికైనా వాంతి రాక మానదు. అతను మసాలా, పానీ తయారు చేసే పద్ధతి చాలా చెండాలంగా ఉంది. అసలు ఆ నీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అనేది ప్రశ్నార్థకంగా మారింది. వీడియోలో మాత్రం మంచి నీరే అని చెబుతున్నట్లు ఉన్నప్పటికీ వాస్తవానికి మాత్రం అది ప్రాణాలు తీసే కాలకూట విషంలా కనిపిస్తోంది.
పానీ తయారీకి అపరిశుభ్రమైన నీరు
ఆ వ్యక్తి పానీ తయారు చేసే విధానం చూస్తే ప్రజల ప్రాణాలు తీసేందుకే అన్నట్లుగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి పానీ పూరీ బండిని పెట్టుకున్నాడు. ఇక పానీని అత్యంత చెండాలంగా తయారు చేశాడు. బకెట్లను కడగకుండా పానీలో ముంచాడు. రెండు అపరిశుభ్రమైన క్యాన్లలో పానీని నింపాడు. ఇక తాను తయారు చేస్తున్న చోటు కూడా అపరిశుభ్రంగా ఉంది. అక్కడే బట్టు ఉతికిన దాఖలాలు కనపిస్తున్నాయి. ఇలా అపరిశుభ్రమైన నీరును తీసుకొచ్చి పానీ పూరీల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలా..? పైగా డబ్బులు తీసుకుని
పానీ పూరీ బండ్లపై వారు తయారు చేస్తున్న విధానంపై హెల్త్ ఇన్స్పెక్టర్లు చొరవ తీసుకోవాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే హక్కు వారికి లేదని పలు ప్రజా సంఘాలు చెబుతున్నాయి. డబ్బులు ఇచ్చి మరీ ఆరోగ్యం దెబ్బతీసుకుంటున్నామని వారు చెబుతున్నారు. ఇక ప్రతి పానీపూరీ బండిపై డ్రైవ్లు నిర్వహించాలని ఆ మేరకు ప్రభుత్వం అధికారులను ఆదేశించాలని నిపుణులు వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు ఇలాంటి పానీ పూరీ తింటే ఇక అంతే సంగతులని వైద్యులు హెచ్చరిస్తున్నారు.