హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానవత్వం చాటిన పోలీస్ బాస్.. కానిస్టేబుల్ శవాన్ని మోసిన కమీషనర్...!

|
Google Oneindia TeluguNews

ప్రమాద వశాత్తు మ‌ృత్యువాత పడిన ఓ కానిస్టేబుల్ శవయాత్రలో పాల్గోనడమే కాకుండా అయన పాడేను మోశాడు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. ఈ సందర్భంగా మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంభాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. కాగా మృత్యువాత పడిన కానిస్టేబుల్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు.

సైబారాబాద్ లిమిట్స్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ తులసీరాంతో పాటు మరో కానిస్టేబుల్ సీఐతో కలిసి ఉన్న ఓ నిందితున్ని పట్టుకునేందుకు బిహార్ వెళ్లారు. అక్కడ నిందితున్ని పట్టుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈనేపథ్యంలోనే యూపికి చేరుకున్న తర్వాత వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆ ప్రమాదంలో కానిస్టేబుల్ తులసిరాం ,బిహార్‌లో పట్టుకున్న నిందితుడు కూడ మృత్యువాత పడ్డారు.

Police Commissioner participates in a constable funeral procession and Carrying the body

ఈనేపథ్యంలోనే తులసీరాం అంత్యక్రియల్లో పాల్గోన్న సైబారాబాద్ పోలీస్ కమీషనర్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. తులసిరాంకు నివాళులు అర్పించి శవయాత్రలో పాల్గోన్నారు. తులసీ రాంను తిరిగి తీసుకురాలేక పోయినా , ఆయన కుటుంభాన్ని ఆదుకుంటామని ఆయన తెలిపారు. దీంతో తోటీ పోలీసులు మృత్యువాత పడితే ఏకంగా కమీషనర్ పాడే మోయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

English summary
Cyberabad Police Commissioner Sajjanar participates in a constable funeral procession and Carrying the body who is dead in accident recently in up. and the constable is working in mylardevpally police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X