వామ్మో.. హీరో కూడానా... తక్కువ ధరకు కార్లు అంటూ మోసం.. కేసు నమోదు..
రీల్పై కనిపించే హీరోలు కూడా మోసం చేస్తున్నారు. అందరూ కాదులెండి కొందరు.. కొందరు కూడా ఒకరీ మోసం వెలుగుచూసింది. కేరింత, ఓ పిట్టకథ మూవీలో నటించిన విశ్వాంత్ మోసం చేశాడు. అదీ కూడా తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని చెప్పాడు. అలా పలువురిని ఆయన ఛీట్ చేశాడు. ఇంకేముంది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.
తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని చెప్పి.. మళ్లీ కలవలేదు. కానీ డబ్బులు మాత్రం ఎన్నో కొన్నీ వసూల్ చేశాడు. ఇంకేముంది కలువడం లేదు.. రోజుకో కహానీ చెప్పడంతో వారు మోసపోయామని గ్రహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హీరో విస్వంత్ తనను నమ్మించి మోసం చేశాడని బాధితులు అంటున్నారు.
తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విస్వంత్.. దిల్రాజు నిర్మించిన 'కేరింత' మూవీ 'ఓ పిట్టకథ' మూవీలో కూడా నటించారు. లవర్ బాయ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతలోనే మోసం చేశారని బాధితులు ముందుకొచ్చారు.