సికింద్రాబాద్లో రెచ్చిపోయిన సైకో.. నడిరోడ్డుపై దారుణం..
సికింద్రాబాద్లో ఓ సైకో రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై కర్రతో బలంగా దాడి చేశాడు. మొదట తలపై కొట్టడంతో.. అతను రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత కూడా వెనుక భాగంలో,తలపై మరోసారి దాడి చేశాడు. సైకో దాడిని గమనించిన ఓ వ్యక్తి.. అక్కడికి పరిగెత్తుకుని రావడంతో అతను పారిపోయాడు.
పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతన్ని నర్సిరెడ్డిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సైకోను పట్టుకున్నారు.
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని బేగంపేట్లోనూ ఓ సైకో ఇలాగే రెచ్చిపోయాడు. రోడ్డుపై కనిపించినవారిపై కత్తితో బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఓ మహిళపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె అరుపులు విని స్థానికులు పరిగెత్తుకుని రావడంతో.. ఆ సైకో అక్కడినుంచి పారిపోయాడు.
వెంటనే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది రక్తం మడుగులో పడి ఉన్న మహిళను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన సైకో ఓ ప్రైవేటు బిల్డింగ్ ఎక్కి దాక్కున్నాడు. గుర్తించిన పోలీసులు అతి కష్టం మీద అతన్ని పట్టుకుని బేగంపేట పోలీస్స్టేషన్కు తరలించారు.