రైల్ ప్రయాణికులకు మసాజ్ చైర్స్
రైలు ప్రయాణికులకు మరిన్ని అధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ,రైల్వే స్టేషన్ల ఆధునికరణకు నడుంబింగించింది రైల్వే శాఖ ,ఇప్పటికే స్టేషన్ల ఆధునికరణ తోపాటు , ప్రయాణికులకు పలు సౌకర్యాలను తీసుకు వస్తోంది. మరోవైపు రైలు ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉచిత వైఫై తోపాటు స్టేషన్లలో వేచి ఉండే వారికి ప్రత్యేక ప్రోగ్రామ్స్ ను అందిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికులు రిలాక్స్ గా ప్రయాణం చేయడం కోసం మరో అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా జర్ని చేస్తున్న సమయంలో తలనొప్పి తోపాటు ఒళ్లు నొప్పులు ఉంటాయి. వీరిని దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ మసాజ్ చైర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాబై రుపాయల చార్జీతో సికింద్రాబాద్ తోపాటు, కాచిగూడ స్టేషన్ ప్లాట్ ఫాంలపై వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇంకేముంది రైలు ఆలస్యమైన పర్వాలేదు, కాసేపు రిలాక్స్ అయ్యేందుకు రైల్వే స్టేషన్లు వేదిక కానున్నాయి.