మద్యం షాపుల్లో రిజర్వేషన్లు, టీకాలు వేగవంతం: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు, కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటగా రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కెబినెట్ ఆరా తీసింది.
కరోనా పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష.. టీకాలు వేగవంతం చేయాలని ఆదేశం
దేశ
వ్యాప్తంగా
వివిధ
రాష్ట్రాల్లో
కరోనా
స్థితిగతులు,
తీసుకుంటున్న
చర్యలపై
వైద్యాధికారులు
కెబినెట్
కు
సమాచారం
అందించారు.
ఇరుగు
పొరుగు
రాష్ట్రాల్లో
కరోనా
పరిస్థితి,
నియంత్రణకు
సంబంధించి
సమాచారాన్ని
ముఖ్యమంత్రి
ప్రత్యేకంగా
అడిగి
తెలుసుకున్నారు.
విద్యాసంస్థలు
పునఃప్రారంభమైన
అనంతర
పరిస్థితులను
కెబినెట్కు
రాష్ట్ర
వైద్య
ఆరోగ్య
శాఖాధికారులు
వివరించారు.
స్కూళ్లు,
కాలేజీలు
తెరిచిన
తరువాత
కరోనా
కేసులలో
పెరుగుదల
లేదని,
కరోనా
పూర్తిగా
అదుపులో
ఉందని
వారు
కెబినెట్
కు
వివరించారు.
అన్నిరకాల
మందులు,
ఆక్సిజన్,
టెస్ట్
కిట్స్,
వ్యాక్సినేషన్
అందుబాటులో
ఉన్నాయని
వివరించారు.
2
కోట్ల
వ్యాక్సినేషన్
పూర్తయిందని,
ఇప్పటివరకు
2
కోట్ల,
56
వేల
159
డోసులు
అందించారని
వారిలో
1
కోటి
45
లక్షల
19
వేల
909
మొదటి
డోసు,
55
లక్షల
36వేల
250
మంది
రెండు
డోసులు
ఇవ్వటం
జరిగింది.
స్పెషల్
వ్యాక్సినేషన్
డ్రైవ్
నేటి
నుంచి
ప్రారంభమవుతుందని,
ప్రతి
గ్రామ,
మండల,
జిల్లా
స్థాయిల్లోని
పంచాయతి
మున్సిపల్
అధికారులు,
సర్పంచులు,
ఎంపిటీసిలు,
జడ్పిటీసిలు,
ఎంపిపి,
జడ్పీ
చైర్
పర్సన్,
ఎంఎల్ఏలు,
ఎంఎల్సీలు
తదితిర
ప్రజాప్రతినిధులు
క్రీయాశీలకంగా
వ్యవహరించాలని,
మంత్రులందరూ
ఈ
కార్యక్రమాన్ని
పూర్తి
స్థాయిలో
విజయం
సాధించాలని,
ప్రతిరోజు
3
లక్షల
వరకు
టీకాలు
వేసే
విధంగా
పూర్తి
సన్నద్దతతో
వ్యవహరించాలని
అధికారులను,
ప్రజాప్రతినిధులను
కేబినెట్
నిర్దేశించింది.
హైదరాబాద్లో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
కొత్త
మెడికల్
కాలేజీలు
వచ్చే
సంవత్సరం
నుండి
ప్రారంభించడానికి
కావలసిన
అన్ని
ఏర్పాట్లు
చేసుకోవాలని
ఆర్
అండ్
బి,
వైద్యారోగ్య
శాఖను
కెబినెట్
ఆదేశించింది.
హైదరాబాద్
లో
నాలుగు
సూపర్
స్పెషాలిటీ
ఆసుపత్రుల
నిర్మాణ
ఏర్పాటుపై
కెబినెట్
సమీక్షించింది.
ఆసుపత్రుల
నిర్మాణ
ఏర్పాట్లపై
సత్వరమే
చర్యలు
చేపట్టాలని,
అత్యంత
వేగంగా
ఆసుపత్రుల
నిర్మాణం
జరగాలని
కెబినెట్
ఆదేశించింది.
గతంలో
130
మెట్రిక్
టన్నుల
ఆక్సిజన్
ఉత్పత్తి
సామర్థ్యం
మాత్రమే
వుండేదని,
దాన్ని
ఇప్పటికే
280
మెట్రిక్
టన్నులకు
పెంచుకున్నామని,
దీనిని
మరింత
పెంచి
550
మెట్రిక్
టన్నులకు
చేరుకునేలా
చర్యలు
చేపట్టాలని
వైద్యశాఖాధికారులను
కెబినెట్
ఆదేశించింది.
ఒకవేళ
చిన్నపిల్లలకు
కరోనా
వస్తే
పరిస్థితులను
ఎదుర్కోవడానికి
సిద్ధంగా
ఉన్నామని
వైద్యాధికారులు
కెబినెట్
కు
వివరించారు.
133
కోట్ల
ఖర్చుతో
బెడ్స్,
మందులు,
ఇతర
సామాగ్రిని,
చిన్నపిల్లల
వైద్యం
కొరకు
సంబంధించి
5200
బెడ్లు,
ముందస్తు
ఎర్పాట్లలో
భాగంగా
ఇప్పటికే
సమకూర్చుకున్నామని
వైద్యాధికారులు
తెలిపారు.
రాష్ట్రంలో
పూర్తి
స్థాయిలో
ఆరోగ్య
మౌలిక
వసతుల
పురోభివృద్ధి
కొరకు
సమగ్రమైన
ప్రణాళికలను
సిద్ధం
చేసుకుని
తదుపరి
కెబినెట్
ముందుకు
తీసుకురావాలని
మంత్రి
మండలి
వైద్య
శాఖాధికారులను
ఆదేశించిది.
వ్యవసాయ, హోంశాఖలపై సమీక్ష
వర్షాపాత
వివరాలు,
వానాకాలంలో
రాష్ట్రంలో
మొత్తం
సాగయిన
భూమి
వివరాలు,
పంటల
దిగుబడి
అంచనాలు
తదితర
వ్యవసాయ
అంశాలపై
కేబినెట్
చర్చించింది.
వానాకాలంలో
పంటల
కొనుగోలుపై
అందుకు
మార్కెటింగ్
శాఖ
సన్నద్ధతపై
కేబినెట్
చర్చించింది.
పోడు
భూముల
సమస్యలపై
పూర్తి
అవగాహన,
పరిష్కారాల
అన్వేషణ,
సూచనలకై
కేబినెట్
సబ్
కమిటీ
నియామకం
జరిగింది.
ఈ
సబ్
కమిటిలో
మంత్రి
సత్యవతి
రాథోడ్
చైర్మన్
గా,
మంత్రులు
జగదీశ్
రెడ్డి,
ఇంద్రకరణ్
రెడ్డి,
అజయ్
కుమార్
లు
సభ్యులుగా
వ్యవహరిస్తారు.
కొత్తగా
ఏర్పడిన
జిల్లాల్లో
ట్రాఫిక్
పోలీస్
స్టేషన్లు
ఇతర
పోలీస్
స్టేషన్లలోని
సమస్యలు
అవసరాలను
సమీక్షించేందుకు
కేబినెట్
సబ్
కమిటీ
నియమిస్తూ
కేబినెట్
నిర్ణయం
తీసుకున్నది.
హోం
శాఖ
మంత్రి
మహమూద్
అలీ
నేతృత్వంలో
మంత్రులు
హరీష్
రావు,
జగదీశ్
రెడ్డి,
కొప్పుల
ఈశ్వర్,
వేముల
ప్రశాంత్
రెడ్డి,
వి.శ్రీనివాస్
గౌడ్,
ఇంద్ర
కరణ్
రెడ్డి,
సబితా
ఇంద్రారెడ్డి,
పువ్వాడ
అజయ్
కుమార్
లు
సభ్యులుగా
ఉంటారు.
సెప్టెంబర్
24వ
తేదీ
నుంచి
శాసనసభ,
మండలి
సమావేశాలు
నిర్వహించాలని
రాష్ట్ర
కేబినెట్
నిర్ణయించింది.
Recommended Video
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది నుంచి రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇటీవల దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబందు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్ షిప్లు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్, వైన్షాప్లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా దళితబంధు ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.