కరోనా: వైన్ షాపులో దూరిన దొంగ, రూ.60 వేల లిక్కర్, నగదు చోరీ, సీసీటీవీ ఫుటేజీ ద్వారా..
కరోనా తెచ్చిన తంటాతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వైన్ షాపులు సహా వర్తక, వాణిజ్య సంస్థలు క్లోజ్ చేశారు. మందు దొరకక కొందరు మందుబాబులు పిచ్చిగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అవును.. మద్యం షాపుల్లో పడి లిక్కరు కొల్లగొడుతున్నారు.
హైదరాబాద్ గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగ తన చేతికి పని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వ వైన్స్ షాపుపై కన్నేశాడు. షాపును నిశీతంగా పరిశీలించాడు. పైన ఉన్న రేకులు కట్ చేసి.. లోపలికి ప్రవేశించాడు. అందులో విలువైన మద్యం గుర్తించి.. రూ.60 వేల విలువైన మందును తీసుకెళ్లాడు. మద్యం దొరికింది కదా అని.. క్యాష్ కౌంటర్ వదిలిపెట్టలేదు. కౌంటర్లో ఉన్న నగదును కూడా తీసుకెళ్లాడు.
Recommended Video
దొంగ.. చోరి చేసే ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీంతో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. వైన్ షాపు పైన ఉన్న రేకులను కత్తిరించి మరీ లిక్కర్ దొంగతనం చేశాడంటే తెలిసిన వ్యక్తి పని అని అనుమానిస్తున్నారు. మరోవైపు వైన్ షాపులు మూసివేయడంతో కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారిని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. చాలా మందిని పరీక్షించి ఇంటింకి పంపించిన వైద్యులు.. కొందరిని మాత్రం తమ వద్ద చేర్పించుకున్నారు.