హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: సికింద్రాబాద్ పబ్లిక్ టాయిలెట్‌లో మహిళ మృతదేహం, రేప్ చేసి, హత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్‌ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రహదారి పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలు, నిందితుల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 secunderabad: A woman raped and murdered in a public toilet

దుండగులతో పెనుగులాటలో మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసి నిందితులు పరారైనట్లు అనుమానిస్తున్నారు. బాధిత మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా, రద్దీగా ఉండే ప్రాంతంలోని టాయిలెట్‌లో ఈ దారుణం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఇలాంటి మహారాష్ట్రలోని ముంబైలో గత సంవత్సరం ఏప్రిల్‌లో జరిగింది. ఓ 9ఏళ్ల బాలికపై అత్యాచారం, చేసి హత్యా చేశాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.

English summary
secunderabad: A woman raped and murdered in a public toilet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X