శంషాబాద్ బాధితురాలి పేరును దిశగా మార్చిన పోలీసులు
శంషాబాద్ బాదితురాలి పేరును పోలీసులు మార్చారు. ఆమె పేరును మార్చేందుకు బాధితురాలి తల్లిదండ్రులు కూడ ఒప్పించారు. గత రెండు రోజులుగా అమె పేరుతో పాటు ఫోటోలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితురాలి పేరును జస్టీస్ ఫర్ దిశగా మార్చుతున్నట్టు చెప్పారు. మీడియా సంస్థలు ,ఇతర సోషల్ మీడియా సంస్థలు కూడ ఆమె పేరును రాయకూడదని సూచించారు. అమె అసలు పేరును ఫోటోలను వాడద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు.
గత శుక్రవారం శంషాబాద్లో యువ వెటర్నిటి వైద్యురాలిపై నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. అనంతం ఆమె బాడి కూడ లభించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. దేశవ్యాప్తంగా పార్టీల నేతలు, ప్రజలు, ప్రజా సంఘాలు, యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు.
కాగా గతంలో ఢిల్లిలో సంచలనం రేపిన యువతి కేసులో కూడ నిర్భయగా పేరు మార్చారు. ఆ పేరుతోనే చట్టాన్ని కూడ తీసుకువచ్చారు. కాగా బాధితురాలి తల్లిదండ్రుల వివరాలను కూడ గోప్యంగా ఉంచాలని సీపీ కోరారు.