హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుమ్మం దాటొద్దు: లాక్‌డౌన్.. కఠినం: అయినా తప్పదు: కేసీఆర్ సర్కార్ చెప్పినట్లు విందాం: కవిత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నివారించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, దీన్ని తప్పనిసరిగా పాటించాలని విజ్ఙప్తి చేశారు.

Recommended Video

Kalvakuntla Kavitha Appeal To The People To Stay At Home In Lockdown Situation

ఈ మేరకు బుధవారం ఉదయం ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలను తెలియజేసిన ఆమె.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ కఠినంగా ఉందని, దీన్ని పాటించడం క్లిష్టమే అయినప్పటికీ అది తమను కాపాడటానికేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

Stay at Home in lockdown, Kalvakuntla Kavitha appeal to the people

లాక్‌డౌన్ బ్రేక్‌డౌన్ చేయకుండా ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఙప్తి చేశారు. ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుందామని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారి ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే- పోలీసులు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని, ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదని చెప్పారు.

Stay at Home in lockdown, Kalvakuntla Kavitha appeal to the people
English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao's daughter and former MP Kalvakuntla Kavitha appeal to the people to stay at home in lockdown situation due to Covid-19 Coronavirus outbreak in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X